Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ- సరూర్నగర్
ముఖ్యమంత్రి కేసీఆర్ మార్గదర్శనంలో పురపాలక మంత్రి కేటీఆర్ ప్రత్యేక చొరవతో తెలంగాణలోని పట్టణాలకు మహర్దశ వచ్చిందని విద్యా శాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి అన్నారు. సోమవారం సరూర్నగర్ డివిజన్ పరిధిలోని హుడా కాలనీ, భగత్సింగ్నగర్, క్రాంతి నగర్, ఉర్దూ మీడియం స్కూల్ దగ్గర, వెంకటేశ్వర కాలనీ రోడ్ నెంబర్ 3, భగత్ సింగ్ నగర్ ఫేస్-2 కాలనీలలో 85 లక్షల రూపాయలతో చేపట్టే యూజిడి పైప్ లైన్ పనులకు శంకుస్థాపన చేశారు. మంత్రి మాట్లాడుతూ శివార్లలో పెరుగుతున్న కాలనీలకు రక్షిత మంచినీరు అందించాలనే ఉద్దేశ్యంతో మిషన్ భగీరథ ద్వారా రూ.1200ల కోట్ల నిధులను ముఖ్యమంత్రి కేసీఆర్ విడుదల చేశారన్నారు. మిషన్ భగీరథకు కేంద్ర ప్రభుత్వం ప్రశంసలు తెలియజేసింది అన్నారు. మంత్రి కేటీఆర్ పూర్తి అవగాహనతో ప్రణాళికబద్ధమైన అభివద్ధికి బాటలు వేస్తున్నారు. పట్టణ ప్రగతిలో భాగంగా తీసుకున్న చర్యలతో నేడు స్వచ్ఛ కాలనీలు, బస్తీలుగా మారటంతో గతంలో కన్నా సీజనల్ వ్యాధులు తగ్గాయన్నారు. సివరేజ్ ట్రీట్మెంట్ ప్లాంట్స్, నూతన లైన్ల కోసం 3500 కోట్లు ముఖ్యమంత్రి కేసీఆర్ మంజూరు చేశారన్నారు. ఈ కార్యక్రమంలో గ్రంథాలయ సంస్థ చైర్మెన్ అయాచితం శ్రీధర్, మాజీ కార్పొరేటర్ అనిత దయాకర్రెడ్డి, బేర బాలకిషన్, కొండల్ రెడ్డి, ఆర్కే పురం డివిజన్ మాజీ అధ్యక్షుడు అరవింద శర్మ, మైనార్టీ నాయకుడు సలీం, రుషి గుప్తా, మల్లేష్ తదితరులు పాల్గొన్నారు.