Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-అంబర్పేట
ముఖ్యమంత్రి సహాయ నిధి పేదలకు ఎంతగానో తోడ్పాటునందిస్తుందని బాగ్ అంబర్పేట డివిజన్ మాజీ కార్పొరేటర్ పద్మావతి డిపిరెడ్డి అన్నారు. కిడ్నీ వ్యాధితో బాధపడుతూ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న సాయి అరవింద్కుమార్కు సీఎం సహాయ నిధి ద్వారా మంజూ రైన చెక్కును సోమ వారం పద్మావతి ఆయన కుటుంబ సభ్యులకు అందజేశారు. ఈ సందర్భంగా ఆమె మాట్లా డుతూ మున్సిపల్ శాఖామంత్రి కేటీఆర్, మేయర్ గద్వాల విజయలక్ష్మి సహకారంతో సీఎం సహాయ నిధి ద్వారా నిధులను మంజూ రు చేయించినట్టు తెలిపారు. సీఎం సహాయ నిధి ద్వారా పేదలను ఆదుకునేందుకు తన వంతు కృషి చేస్తానని చెప్పారు.