Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-కాప్రా
ఏఎస్ రావు నగర్ డివిజన్ పరిధిలోని జమ్మిగడ్డ శ్మశానవాటికకు అధికారికంగా స్థలం కేటాయించాలని కోరుతూ కాప్రా తహసీల్దార్ కార్యాలయం ఎదుట డివిజన్ కార్పొరేటర్ సింగిరెడ్డి శిరీష సోమశేఖర్ రెడ్డి ఆధ్వర్యంలో సోమవారం ధర్నా నిర్వహించారు. జమ్మిగడ్డ ప్రజలతోపాటు కాంగ్రెస్ నాయకులు తరలివచ్చి ఈ ధర్నాలో ప్లకార్డులు ప్రదర్శిస్తూ పాల్గొన్నారు. ఈ సందర్భంగా తక్షణమే శ్మశాన వాటిక స్థలాన్ని అధికారికంగా కేటాయించాలని కోరుతూ ఏఎస్ రావునగర్ కార్పొరేటర్ సింగిరెడ్డి శిరీష సోమశేఖర్ రెడ్డి, ఉప్పల్ ఏ బ్లాక్ అధ్యక్షులు సింగిరెడ్డి సోమశేఖర్ రెడ్డి నేతృత్వంలో అఖిలపక్షం ఆధ్వర్యంలో ధర్నా నిర్వహించి తహసీల్దార్ ఎస్తేరు అనితకు వినతిపత్రం అందజేశారు. ఈ ధర్నాను ఉద్దేశించి కాంగ్రెస్ జిల్లా అధ్యక్షుడు నందికంటి శ్రీధర్, టీపీసీసీ సీనియర్ అధికార ప్రతినిధి, మేడ్చల్ జిల్లా పరిషత్ కాంగ్రెస్ ఫ్లోర్ లీడర్ సింగిరెడ్డి హరివర్ధన్ రెడ్డి మాట్లాడుతూ ఏండ్లుగా అపరిష్కృతంగా ఉన్న జమ్మిగడ్డ శ్మశాన వాటిక సమస్యను తక్షణమే పరిష్కరించాలని డిమాండ్ చేశారు. ఉప్పల్ నియోజకవర్గ బీ బ్లాక్ అధ్యక్షులు సింగిరెడ్డి సోమశేఖర్ రెడ్డి మాట్లాడుతూ ఈ నెల 23వ తేదీ వరకు శ్మశాన వాటిక స్థలం విషయంలో స్పష్టత రాకపోతే ఆమరణ నిరాహార దీక్ష చేస్తామని హెచ్చరించారు. జమ్మిగడ్డ శ్మశానవాటిక కోసం స్థానికులు ఏండ్లుగా పోరాటాలు చేస్తున్నారని గుర్తు చేశారు. ప్రభుత్వం పట్టించుకోకపోగా గత జీహెచ్ఎంసీ ఎన్నికల్లో అప్పటి మేయర్ స్థలం కేటాయించామని చెప్పి హామీ ఇచ్చి ఎన్నికల కోడ్ అమలులో ఉందని ఎన్నికలు అయిపోగానే స్థలం కేటాయిస్తామని స్థానిక ప్రజలకు హామీ ఇచ్చి మోసం చేశారన్నారు. నేటి వరకు శ్మశాన వాటికకు స్థలం కేటాయించలేదన్నారు. దీనిపై స్థానిక తహసీల్దార్ కార్యాలయంలో ఎన్నో పర్యాయాలు వినతిపత్రాలు ఇచ్చినా పట్టించుకోవడం లేదన్నారు. అధికారులు ప్రజా ప్రతినిధులు వైఖరికి నిరసనగా ఆందోళనను ఉధృతం చేస్తామని హెచ్చరించారు. ఇందులో భాగంగా ఈ నెల 23వ తేదీన జమ్మిగడ్డ శ్మశానవాటిక వద్ద నిరాహార దీక్ష చేస్తామన్నారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ ఏఎస్ రావునగర్ డివిజన్ అధ్యక్షుడు కొత్త అంజి రెడ్డి, ఎస్సీ సెల్ నాయకులు పత్తి కుమార్, నాయకులు నీరుకొండ సతీష్ బాబు, ఎస్ఏ. రహీమ్, తాడూరి గగన్ కుమార్, శ్రీకాంత్ రెడ్డి, సీతారాం రెడ్డి, సింగిరెడ్డి వెంకట్ రెడ్డి, అఖిలపక్షం నాయకులు శోభారాణి, భద్ర గామ అంజనేయులు, ఆల్లురయ్య, తదితరులు పాల్గొన్నారు.
మద్దతుగా తరలివచ్చిన కాంగ్రెస్ శ్రేణులు
కాంగ్రెస్ కార్పొరేటర్ సింగిరెడ్డి శిరీష సోమశేఖర్ రెడ్డి ఆధ్వర్యంలో శ్మశానవాటిక సాధన కోసం నిర్వహించిన ధర్నాకు కాంగ్రెస్ శ్రేణులు పెద్ద ఎత్తున తరలివచ్చారు. బీ బ్లాక్ అధ్యక్షులు మందముల పరమేశ్వర్ రెడ్డి, మేడ్చల్ జిల్లా కాంగ్రెస్ మహిళా అధ్యక్షురాలు గోగుల సరితా వెంకటేష్, మహిళా కాంగ్రెస్ జిల్లా కార్యదర్శి మెరుగు సునీత, పార్టీ జిల్లా నాయకులు శివారెడ్డి, గౌడవెల్లి బాల్ రెడ్డి, మేడ్చల్ నియోజకవర్గం నుంచి మండల, మున్సిపల్ అధ్యక్షులు సాయి పేట శ్రీనివాస్, గోమారం రమణారెడ్డి, భీమిడి జైపాల్ రెడ్డి, యాష్కీ శంకర్ గౌడ్, బొమ్మల పల్లి నరసింహులు, మల్లెపూల శ్రీకాంత్ యాదవ్, ముప్పా రామారావు, ముప్పు శ్రీనివాస్ రెడ్డి, కోల కృష్ణ యాదవ్, సింగిరెడ్డి శ్రీనివాస్ రెడ్డి, నియోజకవర్గ నాయకులు ఏనుగు సంజీవరెడ్డి, శ్రీకాంత్ రెడ్డి, దమ్మాయిగూడ మున్సిపల్ కాంగ్రెస్ ఫ్లోర్ లీడర్ వెంకటేష్, సురేష్, జవహర్ నగర్ కిరణ్, శ్రావణ్, జూపల్లి రవీందర్, నల్ల మధుసూదన్ రెడ్డి, చిక్కుడు రమేష్, తదితరులు పాల్గొన్నారు.