Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-కూకట్పల్లి
మానవాళి మనుగడకు చెట్లు మూలాధారం అని మూసాపేట్ కార్పొరేటర్ కొడిచర్ల మహేందర్ అన్నారు. బుధవారం మోతీనగర్, పీఆర్నగర్ కాలనీల్లో స్థానిక జీహెచ్ఎంసీ అధికారులతో మాట్లాడి, కాలనీలోని వక్షాలు పూర్తిగా బ్లాక్ ఫంగస్ వ్యాధి బారిన పడి నల్లగా మారి, చెట్లన్నీ విరిగిపోయే పరిస్థితి ఉండడంతో గమనించి, చెట్లపై మందు పిచికారీ చేయించారు.. ప్రజలందరూ ఇండ్ల ముందు ఉన్న చెట్లు కాపాడుకోవాలని సూచించారు. మానవాళి మనుగడకు ఆరోగ్య సంరక్షణకు చెట్లు మూలాధారం అని, వాటిని కాపాడుకోవాల్సిన బాధ్యత అందరిదని సూచించారు. బీజేపీ డివిజన్ ప్రధాన కార్యదర్శి ఎర్ర స్వామి, రమేశ్ నాయర్, నాగరాజు, మహిళ నాయకురాలు శోభ రాజన్, సతీష్ చారి, నర్సింహులు, అనిల్, రాజు పాల్గొన్నారు.