Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-జగద్గిరిగుట్ట
విద్యార్థి మృతిపై సమగ్ర విచారణ జరిపించాలని సీపీఐ రాష్ట్ర నాయకులు కె.యేసురత్నం, కుత్బుల్లాపూర్ నియోజకవర్గం కార్యదర్శి ఈ. ఉమామహేష్లు ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. బాచుపల్లి వీఎన్ఆర్ విజ్ఞాన జ్యోతి ఇంజినీరింగ్ కళాశాలలో బీటెక్ విద్యార్ధి శివనాగులు ఆత్మహత్య చేసుకోవడంతో తల్లిదండ్రులకు చెప్పకుండా పోలీసుల సహయంతో మృత దేహాన్ని ఆపుపత్రికి తరలించడంపై గురువారం సీపీఐ నాయకులు కళాశాల ముందు ఆందోళన చేపట్టారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ తల్లిదండ్రులకు కనీస సమాచారం ఇవ్వకుండా ఆస్పత్రి నుంచి మృత దేహాన్ని తరలించడం అన్యాయమన్నారు. విద్యార్థి మృతికి సమగ్ర విచారణ చేపట్టాలని, వారి కుటుంబానికి న్యాయం చేయాలన్నారు. విఎన్ఆర్ కళాశాలపై వెంటనే చట్టపరమైన చర్యలు తీసుకుని కళాశాల గుర్తింపును రద్దు చేయాలని డిమాండ్ చేశారు. కార్యక్రమంలో మండల కార్యదర్శి శ్రీనివాస్, నాయకులు హరినాథ్, రాములు, ప్రవీణ్ తదితరులు పాల్గొన్నారు.