Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-ఓయూ
చిలకలగూడ పీఎస్ పరిధిలోని పద్మారావు నగర్ ఆనంద నిలయం అపార్ట్మెంట్లో గురువారం తెల్లవారుజామున చోరీ జరిగింది. అర్ధరాత్రి 3 గంటల సమయంలో ఇద్దరు వ్యక్తులు ఇంట్లోకి వెళ్లేందుకు బయట అనుమానాస్పదంగా తిరుగుతున్నట్లు సీసీ కెమెరాల్లో పోలీసులు గుర్తించారు. అపార్ట్ మెంట్లో రెండు ప్లాట్లలో చోరీ జరిగినట్లు స్థానికులు తెలిపారు. అపార్ట్మెంట్లో నివాసం ఉంటున్న రాజ్ కుమార్ ఇంట్లోకి దొంగలు ప్రవేశించి 16 తులాల బంగారు ఆభరణాలు, వెండి నగదు అపహరించారు. అదేవిధంగా 302 ప్లాట్లో నివాసం ఉంటున్న పూర్ణచందర్ ఇంట్లో కూడా చోరీకి యత్నించినట్లు పోలీసులు తెలిపారు. రాజ్ కుమార్ తన కుటుంబ సభ్యులతో కలిసి ఊరికి వెళ్లి తిరిగి వచ్చే లోపు చోరీ జరిగినట్లు తెలిపారు. తాళాలు వేసి ఉన్న ఇళ్లను లక్ష్యంగా చేసుకుని దొంగలు చోరీకి పాల్పడ్డారు. స్థానికులు వెంటనే పోలీసులకు సమాచారం అందించడంతో సంఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు ప్రారంభించారు. దొంగతనం జరిగిన తీరును అపార్ట్మెంట్వాసులను అడిగి తెలుసుకున్నారు.