Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-బంజారాహిల్స్
ట్రాఫిక్ ఉల్లంఘనలే రోడ్డు ప్రమాదాలకు కారణమని, ముఖ్యంగా ఉన్నత విద్యను అభ్యసిస్తున్న యువత నిబంధనలను పాటించాలని పలువురు వక్తలు సూచించారు. గురువారం పంజాగుట్టలోని అరోరా పీజీ కాలేజీలో ఓరియంటేషన్ డే నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా కళాశాల కోఆర్డినేటర్లు అంజలి, లతా, ట్రాఫిక్ ట్రైనింగ్ ఇనిస్టిట్యూట్ కౌన్సిలర్ సాయి పాల్గొని ట్రాఫిక్ నియమాలపై విద్యార్థులకు అవగాహన కల్పించారు. అత్యధికంగా యువత నియమాలను పాటించకుండా వాహనాలను మితిమీరిన వేగంతో నడుపు ప్రమాదాలు చేస్తున్నారని, మద్యం సేవించి వాహనాలను నడపడం ద్వారా విలువైన ప్రాణాలు కోల్పోవడమే కాక ప్రాణాలను బలిగొంటున్నారని అన్నారు. అధిక జరిమానాలు కఠిన శిక్షలు విధిస్తాన్న యువతలో మార్పు రావడం లేదని విచారం వ్యక్తం చేశారు. ప్రతి ఒక్కరూ ట్రాఫిక్ నియమాలను విధిగా పాటించడం ద్వారానే ప్రమాదాలను అరికట్టగమని అన్నారు. అనంతరం విద్యార్థులు నిర్వహించిన సాంస్కతిక కార్యక్రమాలు ఎంతగానో ఆకట్టుకున్నాయి.