Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-జగద్గిరిగుట్ట
జగద్గిరిగుట్ట డివిజన్లోని సమస్యలను పరిష్కరించి అభివృద్ధి పరచాలని జగద్గిరిగుట్ట డివిజన్ కార్పొరేటర్ కొలుకుల జగన్ అన్నారు. గురువారం గాజులరామారం సర్కిల్ జగద్గిరిగుట్ట డివిజన్ పరిధిలోని పలు సమస్యలపై సర్కిల్ కార్యాలయంలో ఈఈ కృష్ణ చైతన్య, అధికారులు, సూరారం డివిజన్ కార్పొరేటర్ మంత్రి సత్యనారాయణ, సుభాష్నగర్ డివిజన్ మాజీ కార్పొరేటర్ గుడిమెట్ల సురేష్రెడ్డి లతో కలిసి సమీక్షా సమావేశం నిర్వహించారు. జగద్గిరిగుట్ట డివిజన్ హెచ్ఎంటీ పైపులైన్ రోడ్డు వెడల్పు, రింగ్బస్తీలో క్రిస్టియన్ గ్రేవ్ యార్డుకు కంపౌండ్ వాల్, పెండింగ్లో ఉన్న సీసీ రోడ్ల పనులను పూర్తి చేయాలని కోరారు. కార్యక్రమంలో డీఈ శిరీష, రాజు, డీఈఈ రామరాజు, ఏఈ సతీష్, సంపత్ పాల్గొన్నారు.