Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-హైదరాబాద్
హైదరాబాద్, సికింద్రాబాద్ జంట నగరాల్లోని 32 మాదిగ కాలనీలు, బస్తీలకు అగ్రగామి సంఘం చుడీబజార్ హరిజన సేవక మండలి ఎన్నికలు రసవత్తరంగా సాగాయి. సంఘానికి ఈ నెల 26న పోటాపోటీగా జరిగిన సీక్రెట్ బ్యాలెట్ పత్రాల ఎన్నికల్లో బ్యాటింగ్తో సెంచరీ కప్ సాధించారు. చుడీబజార్ హరిజన సేవక మండలి ఎలక్షన్ కమిటీ చైర్మెన్ ఎ అంజయ్య, వైస్ చైర్మెన్ డి వెంకటేష్ ల పర్యవేక్షణలో ఎలక్షన్లు సాఫీగా కొనసాగించారు. అనంతరం ఎన్నికల ఫలితాలను వారు వెల్లడించారు. 484 ఓట్లలో బ్యాట్ గుర్తు కిషన్ కు 275ఓట్లు, కప్ సాసర్ గుర్తుకు 235 ఓట్లు పోలయ్యాయి. నూతన అధ్యక్షులుగా ఎన్నికైన కిషన్, నూతన ప్రధాన కార్యదర్శి గా ఎన్నికైన లైబ్రేరియన్ ధర్మేందర్లను అభినందిచారు.