Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-బడంగ్పేట్
ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రజా సమస్యలను గాలికి వదిలేసి నియంత పాలన చేస్టున్నారని బీజేపీ రాష్ట్ర నాయకులు కోలన్ శంకర్ రెడ్డి అన్నారు. సోమవారం బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు బండి సంజరు కుమార్ నిరుద్యోగ దీక్ష బీజేపీ కార్యాలయం నాంపల్లిలో చేపట్టినట్లు తెలిపారు. ఈ సందర్భంగా అయన మాట్లాడుతూ ప్రభుత్వం ఎన్నికల సమయంలో ప్రజలకు అనేక హామీలు ఇచ్చి అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రజా సమస్యలను పాటించుకొవటం లేదని విమర్శించారు. మహేశ్వరం నియోజకవర్గం నుంచి పార్టీ నాయకులు కార్యకర్తలు పెద్ద సంఖ్యలో బయలుదేరి రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజరు కుమార్కు మద్దతుగా నిరుద్యోగ దీక్షలో పాల్గొన్నారు. కార్యక్రమంలో బీజేపీ నాయకులు శ్రావణ్ కుమార్, మల్లికార్జున్, రామిడి శేఖర్ రెడ్డి, మహేందర్ రెడ్డి, పవన్ కుమార్, సంతోష్ రెడ్డి, సుదర్శన్, ఈశ్వర్ తదితరులు పాల్గొన్నారు.