Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-బడంగ్పేట్
జల్పల్లి మున్సిపల్లోని కాలనీ ప్రజల సమస్యల పరిష్కారం కోసం తన వంతు కషి చేస్తున్నానని కౌన్సిలర్ పల్లపు శంకర్ అన్నారు. సోమవారం మున్సిపల్లోని 19వ వార్డులో రూ.15లక్షల నిధులతో చేపట్టే అండర్ గ్రౌండ్ డ్రయినేజీ నిర్మాణ పనులను ప్రారంబించారు. ఈసందర్బంగా అయన మాట్లాడుతూ రాష్ట్ర ముఖ్య మంత్రి కేసీఆర్ నాయకత్వంలో పేద ప్రజల సంక్షేమం కోసం నిరంతరం కషి చేస్తున్నారని తెలిపారు. రాష్ట్ర విద్యా శాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి అదేశంతో మున్సిపల్లో ఇప్పటికే కోట్లాది రూపాయలతో అనేక అభివద్ది పనులను ప్రారంభించామని చెప్పారు. కార్యక్రమంలో నాయకులు మారుతీ, కాలనీ వాసులు తదితరులు పాల్గొన్నారు.