Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-కూకట్పల్లి
కూకట్పల్లి ఎమ్మెల్యే మాధవరం కష్ణారావు సహకారంతో మూసాపేట్ డివిజన్ స్నేహపురి కాలనీలో జరుగుతున్న అభివద్ధి పనులను మాజీ కార్పొరేటర్ తూము శ్రావణ్ కుమార్ పరిశీలించారు. రిటైనింగ్ పనుల్లో భాగంగా కాలనీలో కొన్ని ఇండ్ల వారికి నడిచేందుకు కూడా వీలు లేకుండా ఇబ్బందులకు గురవుతున్నామని స్థానికులు తెలియజేయడంతో వెంటనే కాంట్రాక్టరుతో మాట్లాడి త్వరితగతిన చర్యలు చేపట్టాలని సూచించారు. అలాగే త్రీ ఏంజిల్స్ స్కూల్ రోడ్డులో వేసిన క్యాచ్పిట్లను పరిశీలించారు. దీని ద్వారా ఆ రోడ్డులో వరద ముంపు సమస్యకు శాశ్వత పరిష్కారం లభిస్తుందని తెలిపారు. కార్యక్రమంలో టీఆర్ఎస్ డివిజన్ అధ్యక్షుడు అంబటి శ్రీనివాస్, నాగుల సత్యం, తిరుపతి, కాలనీ అధ్యక్షుడు వినోద్, నారాయణ రెడ్డి, రమేష్ నాయక్, చంద్రారెడ్డి, మోహన్ రెడ్డి, శ్రీనివాస్, నాగేశ్వరరావు, ఏళ్ల సత్యం, చౌదరి, మల్లేష్, శేఖర్ నాయక్ తదితరులు పాల్గొన్నారు.