Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-బంజారాహిల్స్
కబ్జాదారులనుంచి ప్రభుత్వ భూములకు రక్షణ కల్పించాలంటూ జూబ్లీహిల్స్ కార్పొరేటర్ వెల్దండ వెంకటేష్ మంగళవారం హైదరాబాద్ జిల్లా కలెక్టర్ శర్మన్ను కలిసి వినతిపత్రం అందజేశారు. అనంతరం ఆయన మాట్లాడుతూ హైదరాబాద్ నగరంలో మొట్టమొదటిసారి ఖైరతాబాద్ నియోజకవర్గంలోని డబుల్ బెడ్రూమ్లను ఖరారు చేశారని, కానీఇంతవరకు ఒక్క నిర్మాణం చేపట్టలేదన్నారు. డివిజన్ పరిధిలోని ఫిలింనగర్, దీన్ దయల్ నగర్ మార్కెట్ గల్లీ ఆవరణలో ప్రభుత్వ భూమిని ఎంఐఎం పార్టీ నాయకులు కబ్జా ప్రయత్నిస్తున్నారని వివరించారు. ప్రభుత్వ భూమిని కాపాడాల్సిన బాధ్యత అందరిపై ఉందన్నారు. కార్యక్రమంలో హైదరాబాద్ సెంట్రల్ జిల్లా బీజేపీ ప్రధాన కార్యదర్శి సందీప్, సాయి, డివిజన్ అధ్యక్షుడు శంకర్, రవి నాయక్, సాయి రెడ్డి, పురుషోత్తం, కిరణ్, శేఖర్, రమేష్, గణేష్ యాదవ్ పాల్గొన్నారు.