Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-జగద్గిరిగుట్ట
తెలంగాణ ప్రభుత్వం ప్రవేశపెట్టిన 20 వేల లీటర్ల ఉచిత తాగునీటి పథకాన్ని ప్రజలు సద్వినియోగం చేసుకొవాలని సుభాష్నగర్ డివిజన్ కార్పొరేటర్ గుడిమెట్ల హేమలతా సురేష్రెడ్డి అన్నారు. మంగళవారం డివిజన్ పరిదిలోని కృషి కాలనీలో ఏర్పాటు చేసిన ఉచిత మంచినీటి పథకం వినియోగంపై ప్రజలకు అవగాహన కల్పించారు. ఈ సందర్భంగా కార్పొరేటర్ మాట్లాడుతూ ప్రతి ఒక్కరు తమ క్యాన్ నంబర్తో ఆధార్ నంబర్ అనుసంధానం చేసుకోవాలన్నారు. ఈ అవకాశం డిసెంబర్ 31 వరకు గడువు ఉందని, ప్రతి ఒక్కరు ఈ పథకాన్ని సద్వినియోగం చేసుకుని ఉచిత మంచినీటి పథకాన్ని పొందాలన్నారు. కార్యక్రమంలో జలమండలి ఏఈ రాజు, డివిజన్ ప్రధాన కార్యదర్శి శివాజీ, శ్రీనుకాలనీ ప్రధాన కార్యదర్శి విజరు, శైలజ, గణేష్, తిరుపతి, రాజేశ్వర్, యాదగిరి, పలు బస్తీల మహిళలు తదితరులు పాల్గొన్నారు.