Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-కేపీహెచ్బీ
అభివృద్ధి పనుల్లో జాప్యం వహించకుండా వేగవంతంగా పూర్తి చేయాలని హైదర్నగర్ డివిజన్ కార్పొరేటర్ నార్నే శ్రీనివాస్రావు అన్నారు. మంగళవారం డివిజన్ పరిధిలోని బృందావన్ కాలనీలో జరుగుతున్న సీసీ రోడ్డు పనులను కాలనీ వాసులతో కలిసి పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రజలకు మెరుగైన మౌలిక వసతులు కల్పించేలా కృషి చేస్తానన్నారు. పనులలో నాణ్యత ప్రమాణాలు పాటించాలన్నారు. కార్యక్రమంలో వర్క్ ఇన్స్పెక్టర్ మహదేవ్, డివిజన్ ఉపాధ్యక్షులు రాగ ప్రసాద్, పోతుల రాజేందర్, కాలనీ వాసులు శశి, కిరణ్కుమార్, బాల మురళీ తదితరులు పాల్గొన్నారు.