Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-తుర్కయాంజల్
తుర్కయంజాల్ మున్సిపాలిటీ అభివద్ధికి తమ వంతు సహకారం అందిస్తామని ఎంపీ కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి, ఎమ్మెల్యే మంచిరెడ్డి కిషన్రెడ్డి
అన్నారు. మంగళవారం మున్సిపాలిటీలోని కోహెడ, తొర్రూర్, మునగనూర్, ఇంజాపూర్లలో రూ. 2.85 కోట్ల విలువచేసే పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ అన్ని కాలనీలు అభివద్ధి జరిగేలా ప్రణాళికలు సిద్ధం చేసి వాటిని అమలు చేయాలని సూచించారు. కార్యక్రమంలో మున్సిపల్ చైర్పర్సన్ మల్ రెడ్డి అనూరాధ రాంరెడ్డి, డీసీసీబీ వైస్ చైర్మెన్ కొత్తకుర్మ సత్తయ్య, రంగారెడ్డి జిల్లా రైతు బంధు సమన్వయ సమితి అధ్యక్షులు వంగెటి లక్ష్మారెడ్డి, వైస్ చైర్ పర్సన్ గుండ్లపల్లి హరిత ధన్ రాజ్, జిల్లా గ్రంథాలయ సంస్థ డైరెక్టర్ ఏనుగు ఆనంద్ రెడ్డి, ఆర్డీవో వెంకటాచారి, మున్సిపాలిటీ అధ్యక్షురాలు కొత్తకుర్మ మంగమ్మ శివకుమార్, మున్సిపాలిటీ కమిషనర్ ఎంఎన్ఆర్ జ్యోతి, మున్సిపాలిటీ కౌన్సిల్ ఫ్లోర్ లీడర్ కోసికె ఐలయ్య, రామావత్ కల్యాణ్ నాయక్, కౌన్సిలర్లు కంబాలపల్లి ధన్, బాలరాజ్, సిద్ధల జ్యోతి జంగయ్య, వేముల స్వాతి అమరేందర్ రెడ్డి, తాళ్లపల్లి సంగీత మోహన్ గుప్త, కుంట ఉదయశ్రీ గోపాల్ రెడ్డి, కాకుమాను సునీల్, నారని కవిత శేఖర్ గౌడ్, మర్రి మాధవి మహేందర్ రెడ్డి, పుల్ల గుర్రం కీర్తన విజరు ఆనంద్ రెడ్డి, రేవెల్లి హరిత యాదగిరి, మేతరి అనురాధ దర్శన్, బొక్క రవీందర్ రెడ్డి, బొక్క శ్రీలత గౌతమ్ రెడ్డి, టీఆర్ఎస్ మున్సిపాలిటీ అధ్యక్షుడు వేముల అమరేందర్ రెడ్డి, మాజీ సర్పంచ్లు చెవుల దశరథ, కందాడ లక్ష్మారెడ్డి, హైదరాబాద్ మార్కెట్ కమిటీ మాజీ చైర్మెన్బొక్క చెన్నారెడ్డి, గడ్డిఅన్నారం మార్కెట్ కమిటీ చైర్మెన్ ముత్యంరెడ్డి, నాయకులు వంగేటి గోపాల్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.