Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-హైదరాబాద్
'ఆదరణ సేవా సమత, అమన్ వేదిక' స్వచ్ఛంద సంస్థల ఆధ్వర్యంలో గురువారం బేగంబజార్లో ఉచిత వైద్యశిబిరం, అనాథలకు దుస్తుల పంపిణీ కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆదరణ సేవా సమత అధ్యక్షులు డాక్టర్ నాగేశ్వరరావు టీబీ రోగులకు, వలస కూలీలకు వైద్య పరీక్షలు నిర్వహించి మందులు అందించారు. అనంతరం అనాథలకు దుస్తుల పంపిణీ చేశారు. ప్రజలెవరూ మత్తు పదార్థాలకు బానిస కావద్దన్నారు. వ్యసనాలకు దూరంగా ఉండాలని సూచించారు. కార్యక్రమంలో స్వచ్ఛంద సేవా సంస్థ సభ్యులు రవి, ఫిరాజ్ మౌలానా తదితరులు పాల్గొన్నారు.