Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-జగద్గిరిగుట్ట
పెండింగ్లో ఉన్న పనులను దశల వారిగా పూర్తి చేస్తానని జగద్గిరిగుట్ట డివిజన్ కార్పొరేటర్ కొలుకుల జగన్ అన్నారు. శుక్రవారం డివిజన్ పరిధిలోని శ్రీనివాస్నగర్లో రూ.13 లక్షలతో నిర్మించిన సీసీ రోడ్ల పనులను ఆయన పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఎన్నికల్లో ఇచ్చిన హామీలను కుత్బుల్లాపూర్ ఎమ్మెల్యే కేపీ వివేకానంద్, రంగారెడ్డి జిల్లా ఎమ్మెల్సీ శంబీపూర్రాజు సహకారంతో పరిష్కరిస్తున్నానని తెలిపారు. జగద్గిరిగుట్ట డివిజన్లోని సమస్యలను పరిష్కరించి ఆదర్శవంతంగా తీర్చిదిద్దుతామన్నారు. ప్రజలు ఇబ్బందులు పడకుండా పనులు వేగవంతంగా చేయాలని అధికారులను, కాంట్రాక్టర్లను ఆదేశించారు. ఈ కార్యక్రమంలో నాయకులు సయ్యద్ రశీద్, మల్లారెడ్డి, బాలు, ఖలీల్, నర్సింగ్గౌడ్, ఆజం, విఘ్నేష్, సంతోష్, సాజిద్, ఖయ్యుం, వినోద్ తదితరులు పాల్గొన్నారు.