Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-హైదరాబాద్
మూసాపేట సర్కిల్ ఫతేనగర్ డివిజన్ పరిధిలోని భరత్నగర్ కాలనీని అన్నిరంగాలలో అభివద్ధి పరచి ఆదర్శవంతంగా తీర్చి దిద్దుతానని కార్పొరేటర్ పండాల సతీష్గౌడ్ అన్నారు. శుక్రవారం ఫతేనగర్ డివిజన్ పరిధిలో రూ. 20 లక్షలతో గత నెల ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు చేతుల మీదుగా ప్రారంభమైన పనులను స్థానిక కాలనీ వాసులు, టీఆర్ఎస్ నాయకులతో కలిసి పర్యవేక్షించారు. ఈ సందర్భంగా కార్పొరేటర్ పండాల సతీష్గౌడ్ మాట్లాడుతూ.. ఉమ్మడి రాష్ట్రంలో అధ్వాన్న స్థితిలో ఉన్న భరత్ నగర్ కాలనీ రోడ్డు, టీఆర్ఎస్ హయాంలోనే బాగు చేశామన్నారు. 80 శాతం మౌలిక వసతుల కల్పన పూర్తయిందని చెప్పారు. మిగిలిన మరో 20 శాతం అభివద్ధి పనులను త్వరలో పూర్తి చేస్తామన్నారు. ఈ కార్యక్రమంలో భరత్ నగర్ కాలనీ టీఆర్ఎస్ అధ్యక్షుడు సురేష్ నాయుడు, ఉమావతి, పవన్, జ్యోతి గౌడ్, సాంబా రెడ్డి, వేణుగోపాల్, సోమయ్య తదితరులు పాల్గొన్నారు.