Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-దుండిగల్
కుత్బుల్లాపూర్ నియోజకవర్గం నిజాంపేట్ మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలోని ప్రగతినగర్ లీలా సుందరయ్య ఫంక్షన్ హాల్లో తమాండో కరాటే మార్షల్ ఆర్ట్స్ అకాడమీ ఫౌండర్ ప్రెసిడెంట్ అబ్దుల్ బాకీ నేతత్వంలో బెల్ట్ గ్రేడింగ్ టెస్టులు నిర్వహించారు. ఈ ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా నిజాంపేట్ మున్సిపల్ కార్పొరేషన్ కమిషనర్, అసిస్టెంట్ కమిషనర్, 27వ డివిజన్ కార్పొరేటర్ జ్యోతి రెడ్డి బండారి లేఔట్ సంక్షేమ సంఘం అధ్యక్షుడు నరసింహారెడ్డి లు హాజరయ్యారు. ఈ పోటీల్లో నిజాంపేట, ప్రగతి నగర్, బోరబండ, భరత్ నగర్, ఓల్డ్ సిటీ నుంచి 100 మంది పిల్లలు ఉత్సాహంగా పాల్గొన్నారు. ఉదయం 6 గంటల నుంచి 11 గంటల వరకు జరిగిన కరాటే బెల్ట్ టెస్టు పోటీలో పిల్లలు తమ ప్రతిభను చాటి ఉత్తీర్ణులయ్యారు. అనంతరం పోటీల్లో పాల్గొన్న విజేతలకు బహుమతులు అందజేశారు. కార్యక్రమంలో 27వ డివిజన్ టీఆర్ఎస్ అధ్యక్షులు శ్రీనివాస్ యాదవ్, 29వ డివిజన్ రవీంద్ర, నరసింహ రాజు, కాంతారావు, రోజా, హేమ, అకాడమీ జనరల్ సెక్రెటరీ డాక్టర్ విజయ భవాని తదితరులు పాల్గొన్నారు.