Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-మేడ్చల్ కలెక్టరేట్
కీసరగుట్ట శ్రీ రామలింగేశ్వర స్వామి ఆలయ చైర్మెన్్గా తటకం ఉమాపతి శర్మ గురువారం ప్రమాణ స్వీకారం చేశారు. అంతకుముందు ఆలయంలోని మూలవిరాట్కు కుటుంబ సభ్యులతో కలిసి ప్రత్యేక పూజలు నిర్వహించారు. వేదపండితులు స్వామివారి ఆశీర్వచనం అందజేసి, మహా ప్రసాదాలను అందించారు. ఆలయ ఈఓ సుధాకర్ రెడ్డి, ఆలయ ధర్మకర్తలు, ట్రస్ట్ బోర్డ్ సభ్యులు, కీసర ఎంపీపీ మల్లారపు ఇందిరా, మండల ప్రజాప్రతినిధులు వివిధ పార్టీల నేతలు హాజరై నూతన చైర్మెన్ను శాలువాలతో ఘనంగా సన్మానించారు