Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-జగద్గిరిగుట్ట
జగద్గిరిగుట్ట వెంకటేశ్వర నగర్లోని బాపూజీ హైస్కూల్లో పాఠశాల కరస్పాండెంట్, చైర్మెన్ నవ్య ప్రభాకర్రావు ఆధ్వర్యంలో అయ్యప్ప స్వామి మహపడి పూజ కార్యక్రమాన్ని గురువారం వైభవంగా నిర్వహించారు. వివేకానందనగర్ మాజీ కార్పొరేటర్ మాధవరం రంగారావు పాల్గొని ప్రత్యేక పూజలు చేశారు. అనంతరం అన్న సమారాధన నిర్వహించారు. కార్యక్రమంలో ప్రసాద్ గురుస్వామి, గోలి శంకర్ గురు స్వామి, అయ్యప్ప స్వాములు తదితరులు పాల్గొన్నారు.