Authorization
Mon Jan 19, 2015 06:51 pm
ఎమ్మెల్యే దానం నాగేందర్
నవతెలంగాణ-బంజారాహిల్స్
బీజేపీ బురదలో కూరుకుపోయిందని, స్వచ్ఛతపై మాట్లాడే హక్కు వారికి లేదని ఖైరతాబాద్ ఎమ్మెల్యే దానం నాగేందర్ అన్నారు. అభివద్ధిలో అగ్రస్థానంలో తెలంగాణ రాష్ట్రం ఉందన్నారు. గురువారం నియోజకవర్గ పరిధిలోని వెంకటరమణ కాలనీ మహిళా మండలిలో 30 కల్యాణ లక్ష్మి, షాదీ ముబారక్ చెక్కులను లబ్దిదారులకు ఖైరతాబాద్ రెవెన్యూ అధికారులు లైబ్రరీ చైర్మెన్ ప్రసన్నకుమారితో కలిసి అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ బీజేపీ నేతల తీరుపై ఘాటుగా విమర్శించారు. రాష్ట్ర నేతలు అవగాహన లేకుండా రాసి ఇచ్చిన స్క్రిప్టు చదివి ఆ పార్టీ జాతీయ అధ్యక్షుడు అపహాస్యం పాలవుతున్నరాని అన్నారు. ముఖ్యమంత్రి కేసీఆర్ నేతత్వంలో టీఆర్ఎస్ ప్రభుత్వం ప్రవేశపెడుతున్న సంక్షేమ పథకాలను కేంద్ర మంత్రులే ప్రశంసించిన సందర్భాలు ఎన్నో ఉన్నాయన్నారు. విజయశాంతి వ్యాఖ్యలపై తాను స్పందించడం బాగుండదని దానం అన్నారు. రాష్ట్రంలో ఎక్కడ చెత్త లేదని ఢిల్లీ నుంచే చెత్త వస్తుందని విమర్శించారు. ఇప్పటికైనా బీజేపీ నేతలు అనవసరంగా నోరు పారేసుకోవటం మానుకోవాలని హితవు పలికారు. మహిళా మండలి కమ్యూనిటీ హాల్ నిర్మాణానికి రూ. 50లక్షలు ఇస్తామని హామీ ఇచ్చారు. కార్యక్రమంలో డివిజన్ అధ్యక్షుడు అరుణ్ కుమార్, సీనియర్ నాయకులు నాగేశ్వరావు, వెంకటరమణ తదితరులు పాల్గొన్నారు.