Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-కంటోన్మెంట్
సికింద్రాబాద్ కంటోన్మెంట్ బోర్డు ప్రాంతంలో ఉచిత మంచినీటి సరఫరా కోసం ఈ నెల 10వ తేదీన ప్రగతి భవన్ ముట్టడి చేపట్టనున్నట్టు కంటోన్మెంట్ బోర్డు నామినేటెడ్ సభ్యుడు, బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు రామకృష్ణ ప్రకటించారు. శుక్రవారం తన చాంబర్లో ఏర్పాటు చేసిన విలేకర్ల సమావేశంలో ఆయన మాట్లాడారు. రాష్ట్ర ప్రభుత్వం కంటోన్మెంట్పై వివక్ష చూపిస్తోందన్నారు. హెచ్ఎంసీలో అందరికీ ఉచిత నీరందిస్తూ నగర నడిబొడ్డున, సికింద్రాబాద్ జీహెచ్ఎంసీ కార్యాలయానికి కూతవేటు దూరంలో ఉన్న కంటోన్మెంట్ ప్రాంతానికి ఈ పథకాన్ని అమలు చేయడం లేదన్నారు. కంటోన్మెంట్ వాసులు నీటి కోసం అనేక ఇబ్బందులు పడుతున్నారన్నారు. ఈ కార్యక్రమంలో బీజేపీ నాయకులు విజరు కుమార్, మధు గౌడ్, మహేష్ పాల్గొన్నారు.