Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-బేగంపేట్్/సిటీబ్యూరో
ప్రతి ఏటా వర్షాకాలంలో వచ్చే వరదలతో తీవ్ర ఇబ్బందులు పడుతున్న బేగంపేట నాలా పరిసర ప్రాంత ప్రజల వరదముంపు సమస్యకు నాలాల సమగ్ర అభివృద్ధి కార్యక్రమంతో శాశ్వత పరిష్కారం లభిస్తుందని రాష్ట్ర పశుసంవర్ధక, మత్స్య, పాడి పరిశ్రమల అభివృద్ధి, సినిమాటోగ్రఫీ శాఖల మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ అన్నారు. శుక్రవారం మాసాబ్ ట్యాంక్లోని మున్సిపల్ పరిపాలనశాఖ కార్యాలయంలో మున్సిపల్ పరిపాలన శాఖ స్పెషల్ చీఫ్ సెక్రెటరీ అరవింద్ కుమార్తో కలిసి వాటర్ వర్క్స్, రెవెన్యూ, దేవాదాయ శాఖల అధికారులతో ఏర్పాటు చేసిన సమావేశంలో వివిధ అంశాలపై సమగ్రంగా చర్చించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ బేగంపేట నాలాకు ప్రతి ఏడాదీ వర్షాకాలంలో ఎగువ నుంచి వచ్చే వరద నీటితో బేగంపేట డివిజన్లోని బ్రాహ్మణ వాడి, అల్లంతోట బావి, ప్రకాష్ నగర్ తదితర ప్రాంతాల్లోని ప్రజలు వరద ముంపుకు గురవుతున్నారని వివరించారు. కార్యక్రమం కింద ఈ నాలాకు ఇరువైపులా రిటైనింగ్ వాల్స్ నిర్మాణం, ఆయా కాలనీల నుంచి స్ట్రాం వాటర్ పైప్ లైన్, రోడ్ల నిర్మాణం వంటి చర్యలతో ఆయా ప్రాంతాల ప్రజలకు వరదముంపు సమస్యకు శాశ్వత పరిష్కారం చూపినట్టు అవుతుందని తెలిపారు. ప్రాజెక్ట్, వాటర్ వర్క్స్ అధికారులు సమన్వయంతో వ్యవహరించి ఇందుకు అవసరమైన ప్రతిపాదనలను సిద్దం చేయాలని సంబంధిత అధికారు లను మంత్రి ఆదేశించారు. ముషీరాబాద్ మండల పరిధిలోని భోలఖ్ పూర్లో గల సోమప్ప మఠంకు చెందిన 3,571 గజాల స్థలంలో సుమారు 130 నిరుపేద కుటు ంబాలు ఏండ్లుగా నివసిస్తున్నాయనీ, వీరిలో 53 కుటుం బాలకు 1996లో పట్టాలు కూడా పొందాయని తెలిపారు. ఇక్కడ నివసిస్తున్న కుటుంబాల వారు విద్యుత్, నల్లా కనెక్షన్ వంటి సౌకర్యాలు పొందారని చెప్పారు. ఈ స్థలాన్ని స్వాధీనం చేసుకొని, పేద ప్రజలకు డబుల్ బెడ్ రూమ్ ఇండ్లను నిర్మించి ఇవ్వాలనే యోచనలో ప్రభుత్వం ఉందని మంత్రి వివరించారు. ముషీరాబాద్ మండల పరిధిలోని జీరా కాంపౌండ్ లో సుమారు 70 కుటుంబా లు ఏండ్లుగా ఇండ్లను నిర్మించుకుని జీవనం సాగిస్తు న్నారనీ, వీరికి రోడ్లు, విద్యుత్ వంటి సౌకర్యాలను కూడా ప్రభుత్వం కల్పించిందని చెప్పారు. దేవాదాయ శాఖ కు చెందిన ఈ స్థలాన్ని స్వాధీనం చేసుకుని అవసరమైన పరిహారాన్ని చెల్లించేందుకు సిద్దంగా ఉందని తెలిపారు. వీలైనంత త్వరగా స్థల సేకరణ జరిపితే డబుల్ బెడ్ రూమ్ ఇండ్లను నిర్మించేందుకు ప్రతిపాదనలను కూడా సిద్దం చేసినట్టు చెప్పారు. రాంగోపాల్ పేట డివిజన్ లోని 134 గృహాల వారు 1994లో రెగ్యులరైజేషన్ కింద దరఖాస్తు చేసుకున్నారనీ, సుప్రీం కోర్టులో పలు వివాదాలు పెండింగ్లో ఉండటంతో ప్రభుత్వం రెగ్యులరైజేషన్ ప్రక్రియ కొనసాగలేదని వివరించారు. 2002లో కోర్టు తీర్పు లబ్దిదారులకు అనుకూలంగా వచ్చినప్పటికీ 816 గడువు ముగియడంతో దరఖాస్తులు పెండింగ్లో ఉన్నా యని తెలిపారు. రెగ్యులరైజేషన్ విషయమై ఇటీవల జరిగిన మంత్రివర్గ ఉప సంఘం సమావేశం సానుకూలత వ్యక్తం చేసినట్టు పేర్కొన్నారు. ఈ సమావేశంలో వాటర్ వర్క్స్ దాన కిషోర్, కమిషనర్ లోకేష్ కుమార్, కలెక్టర్ శర్మన్, దేవాదాయ శాఖ కమిషనర్ అనిల్ కుమార్, జియాఉద్దీన్, తదితరులు పాల్గొన్నారు.