Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-నేరెడ్మెట్
తెలంగాణ ఉద్యమకారుల ఫోరం చైర్మెన్ డాక్టర్ చీమ శ్రీనివాస్, గ్రేటర్ హైదరాబాద్ చైర్మెన్ పి.సురేందర్రెడ్డి తెలంగాణ గిడ్డంగుల సంస్థల చైర్మెన్, తెలంగాణ ఉద్యమ నాయకులు సాయిచంద్ను కలిసి అభినందనలు తెలియజేశారు. తెలంగాణ ఉద్యమ కారుల సంక్షేమం కోసం కృషి చేయాలని కోరారు. సాయి చంద్ స్పందిస్తూ త్వరలో సీఎం కేసీఆర్, మంత్రి హరీష్ రావులతో చర్చించి సంక్షేమ బోర్డు ఏర్పాటుకు కృషి చేస్తానని తెలిపారు. ఈ సందర్భంగా చీమ శ్రీనివాస్ సాయి చంద్ని ఉదేశించి మాట్లాడుతూ ఉద్యమకారునికి అవకాశాన్ని కల్పించినందుకు సీఎం కేసీఆర్కు తెలంగాణ ఉద్యమకారుల ఫోరమ్ తరుపున కృతజ్ఞతలు తెలిపారు.