Authorization
Mon Jan 19, 2015 06:51 pm
-గాంధీనగర్ కార్పొరేటర్ పావని
వినయ్ కుమార్
నవతెలంగాణ-అడిక్మెట్
ప్రజలకు అందుబాటులో ఉండే విధంగా ప్రత్యేక వసతులతో శాంతి యువజన సంఘం బస్తీలో కమ్యూనిటీ హాల్ నిర్మిస్తామని గాంధీనగర్ కార్పొరేటర్ పావని వినరు కుమార్ అన్నారు. స్థానిక ప్రజల వినతి మేరకు మంగళవారం గాంధీనగర్ శాంతి యువజన సంఘం బస్తీలో పర్యటించారు. ప్రజలకు అందుబాటులో ఉండే విధంగా త్వరలో కమ్యూనిటీ హాల్ నిర్మాణం, అలాగే బస్తీ దవాఖాన ఏర్పాటు చేస్తామని హామీ ఇచ్చారు. కార్యక్రమంలో బీజేపీ నగర నాయకులు ఎ.వినయ్ కుమార్, ముత్యాలు, బీజేవైఎం నాయకులు తరుణ్ కుమార్, అరుణ్ కుమార్, బస్తీ నాయకులు ఎన్.పెంటయ్య, సుంక రాజు, వేణు యాదవ్, దయా, మూసా అహ్మద్, ఈద సాయి, హరినాథ్ పాల్గొన్నారు.