Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-కూకట్పల్లి
అభివృద్ధి పనుల్లో నాణ్యతాప్రమాణాలు పాటించాలని కార్పొరేటర్ మాధవరం రోజాదేవి రంగారావు అన్నారు. మంగళవారం వివేకానందనగర్ డివిజన్ వెంకటేశ్వర నగర్ 33, 35 బ్లాక్లో చేపడుతున్న భూగర్భ డ్రయినేజీ, సీసీ రోడ్డు పనులను పరిశీలించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ నిర్మాణ పనుల్లో నాణ్యత పాటిస్తూ ప్రజలకు ఇబ్బంది కలగకుండా త్వరగా పూర్తిచేయాలని అధికారులకు సూచించారు. డివిజన్లో ఇంకా ఏమైనా సమస్యలు ఉంటే తమ దష్టికి తీసుకువస్తే ఎమ్మెల్యే గాంధీ దష్టికి తీసుకువెళ్లి సంబంధిత అధికారులతో మాట్లాడి సమస్యలను పరిష్కరిస్తానని అన్నారు. కార్యక్రమంలో జీహెచ్ఎంసీ ఏఈ స్వప్న, వర్క్ ఇన్స్పెక్టర్ సుధాకర్, మాజీ కార్పొరేటర్ మాధవరం రంగారావు, డివిజన్ అధ్యక్షులు సంజీవరెడ్డి, కాలనీవాసులు సోమయ్య, సత్యనారాయణ, చంద్రమోహన్, సాగర్, బాబు, జగన్మోహన్, లక్ష్మీనారాయణ, లక్ష్మీనరసయ్య, నరేష్, వెంకటేష్ తదితరులు పాల్గొన్నారు.