Authorization
Sun March 23, 2025 05:52:59 am
నవతెలంగాణ-సుల్తాన్బజార్
రోడ్డు ఫుట్పాత్లను ఆక్రమిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని సుల్తాన్ బజార్ ట్రాఫిక్ ఏసీపీ శ్రీనివాస్ రెడ్డి అన్నారు. బుధవారం మహబూబ్ గంజ్లో రోడ్ ఫుట్ పాత్లపై వెలిసిన అక్రమ నిర్మాణాలను తొలగించారు. కార్యక్రమంలో ట్రాఫిక్ డీసీపీ కరుణాకర్, అడిషనల్ డీసీపీ ప్రసాద్, సుల్తాన్ బజార్ ఇన్స్పెక్టర్ సుమన్ కుమార్, ఎస్ఐ ప్రసాద్, ఏఎస్ఐ హబిద్, జీహెచ్ఎంసీ గోషామాల్ సర్కిల్ 14 టౌన్ ప్లానింగ్ సెక్షన్ అధికారి శ్రీనివాస్ యాదవ్ పాల్గొన్నారు.