Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-జగద్గిరిగుట్ట
గాజులరామారం డివిజన్ కార్పొరేటర్, జీహెచ్ఎంసీ స్టాండింగ్ కమిటీ సభ్యులు రావుల శేషగిరిరావు జన్మదినం సందర్భంగా ఉమాదేవినగర్, లెనిన్నగర్ బస్తీల ఆధ్వర్యంలో శ్రీనివాస్నగర్ చౌరస్తాలో బుధవారం నిరుపేదలకు అల్పాహారం, స్వీట్లు పంపిణీ చేశారు. అనంతరం కార్పొరేటర్ రావుల శేషగిరిరావుకి జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. రాజకీయంగా పార్టీకి, ప్రజలకు సేవలు అందించే విధంగా పాటుపడాలన్నారు. కార్యక్రమంలో డివిజన్ ఎస్టీ సెల్ అధ్యక్షులు తారాసింగ్, బీసీ సెల్ ఉపాధ్యక్షులు పి.సమ్మయ్య యాదవ్, డివిజన్ జాయింట్ సెక్రటరీ కె.కరుణాకర్ రాజు, బస్వరాజు పటేల్, వనం రాజు, శివనాయక్, ధౌర్యనాయక్, అశోక్చారి, బాబు, ప్రసాద్, ప్రవీణ్, డివిజన్ కార్యదర్శి నవాబ్, యూత్ నాయకులు భరత్, ఇబ్రహీం, అబ్బు, రహమాన్, సన్నీ, విజరు, నాయకులు రాజు తదితరులు పాల్గొన్నారు.