Authorization
Mon Jan 19, 2015 06:51 pm
మాజీ ఎమ్మెల్యే కూన శ్రీశైలంగౌడ్
నవతెలంగాణ-జగద్గిరిగుట్ట
కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన సంక్షేమ పథకాలను ప్రజల్లోకి తీసుకెళ్లి బీజేపీని బలోపేతం పరిచేందుకు కృషి చేయాలని కుత్బుల్లాపూర్ మాజీ ఎమ్మెల్యే, బీజేపీ రాష్ట్ర నాయకులు కూన శ్రీశైలంగౌడ్ అన్నారు. శుక్రవారం రంగారెడ్డినగర్ డివిజన్ పరిధిలోని వెంకట్రామిరెడ్డినగర్, గాంధీనగర్ బీజేపీ ముఖ్య నాయకులతో సమావేశమై పార్టీ బలోపేతంపై అనుసరించాల్సిన పలు అంశాలపై చర్చించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ బస్తీలో ఒక కమిటీని ఏర్పాటు చేసుకుని రోడ్లు, డ్రయినేజీ, ఇతర మౌలిక సదుపాయాలు ప్రజలకు ఉపయోగపడేలా అధికారులతో మాట్లాడి సమస్యల పరిష్కారం కోసం కృషి చేయాలన్నారు. కేంద్ర ప్రభుత్వ సంక్షేమ పథకాలను పేద ప్రజలకు అందించే విధంగా కృషి చేయాలన్నారు. కార్యక్రమంలో నాయకులు మోటే శ్రీనివాస్ యాదవ్, గరిగే శేఖర్. రంగ శ్రీనివాస్ గౌడ్, అరువ వెంకట్, రమేష్ మంజల్కర్, రాములు, పెద్ద తిమ్మయ్య, ఖాజా, శ్రీనివాస్, నర్సింహా, మురళీకృష్ణ, వెంకట్రామిరెడ్డి, నవీన్రెడ్డి, సాయిగౌడ్, కనకరాజు, కార్తీక్, వీరభద్రరావు, రాంరెడ్డి, అరవింద్, నాగబాబు, మోహన్ తదితరులు పాల్గొన్నారు.