Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-కల్చరల్
కొమురవెల్లిలో ఒగ్గు కళాకారులకు సముచిత గౌరవం కల్పిస్తాం అని ఆబ్కారీ, క్రీడా, పర్యాటక, సాంస్కృతికశాఖ మంత్రి శ్రీనివాస్ గౌడ్ అన్నారు. మల్లన్న ఆలయంలో ఒగ్గు పూజారులను తొలగించడంతో జరిగిన గందరగోళం పరిస్థితిపై రాష్ట్ర కురుమ సంఘం అధ్యక్షులు, ఎమ్మెల్సీ ఎగ్గ మల్లేశం ఆధ్వర్యంలో మంగళవారం రవీంద్ర భారతిలోని మంత్రి చాంబర్లో అత్యవసర సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా మంత్రి శ్రీనివాస్ గౌడ్ మాట్లాడుతూ రాష్ట్రంలో జానపద, గ్రామీణ వృత్తి కళాకారులతోపాటు ఒగ్గు కళాకారులకు సముచిత గౌరవాన్ని కల్పిస్తున్నామన్నామని తెలిపారు. ఒగ్గు పూజారుల ప్రతినిధులు, గొల్ల కురుమలు చేసిన అభ్యర్థన మేరకు కొమురవెల్లి మల్లన్న ఆలయంలో పూజా విధానంలో గత ఆచారాలు, సంప్రదాయాలనే కచ్చితంగా పాటించాలని దేవాదాయశాఖ అధికారులకు సూచించారు. భవిష్యత్లో ఎలాంటి పొరపాట్లు జరగకుండా చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. సమావేశంలో దేవాదాయ శాఖ కమిషనర్ అనిల్ కుమార్, సాంస్కృతిక శాఖ సంచాలకులు మామిడి హరికృష్ణ, ఆలయ ఈవో బాలాజీ, ఆలయ మాజీ చైర్మెన్ చేవెళ్ల సంపత్, కొలుపుల నర్సింహ, బండారు నారాయణ, చీరా శ్రీకాంత్, తుంకుంటా అరుణ్ కుమార్, బూరగడ్డ పుష్ప నగేష్, ఒగ్గు ధర్మయ్య, ఒగ్గు రవి, మధు, మహిళా కమిటీ అధ్యక్షురాలు తమగొండ బాలమణి, సుగుణ, కళావతి, కాలే అమర్నాథ్ తదితరులు పాల్గొన్నారు.