Authorization
Wed March 19, 2025 04:16:38 pm
నవతెలంగాణ-అంబర్పేట
దేశంలో ఎక్కడాలేనన్నీ సంక్షేమ పథకాలు తెలంగాణలోనే అమలవుతున్నాయని, వాటిని ప్రజలు అందిపుచ్చుకుని అభివృద్ధిలోకి రావడానికి కుల సంఘాలు కీలక భూమిక పోషించాలని బీసీ కమిషన్ చైర్మెన్ డాక్టర్ వకుళాభరణం కృష్ణమోహన్రావు అన్నారు. కుల సంఘాలకు స్థలాలు, భవనాలు కేటాయించి ముఖ్యమంత్రి ఆత్మగౌరవాన్ని పెంచారన్నారు. గురువారం అంబర్పేటలో అలీకేఫ్ చౌరస్తా కేతేశ్వర కల్యాణ మండపంలో మేదర సంఘం నూతన డైరీని ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రజలను చైతన్యం చేయడంలో కుల సంఘాల పాత్రనే గురుతరమైనదని అన్నారు. రాష్ట్రంలో కేసీఆర్ నాయకత్వంలో సంక్షేమ పాలన కొనసాగుతున్నదని చెప్పారు. ప్రతి పథకాన్ని ఆత్మగౌరవ నినాద దిశగా రూపొందించి, రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్నదని సంతప్తి వ్యక్తం చేశారు. కార్యక్రమంలో రాష్ట్ర మేదర సంఘం వర్కింగ్ ప్రెసిడెంట్ కె. మురళికృష్ణ, మాజీ అధ్యక్షుడు ప్యారస్యాని బాలరాజు, నాయకులు శ్రీనివాస్, గోపికష్ణ పాల్గొన్నారు.