Authorization
Fri March 21, 2025 01:01:26 pm
నవతెలంగాణ-ధూల్పేట్
పోరాటాలతోనే ప్రజా సమస్యలు పరిష్కారమవుతాయని సీపీఐ(ఎం) రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులు మహమ్మద్ అబ్బాస్ అన్నారు. హైదరాబాద్ సౌత్ జిల్లా, మేడ్చల్ జిల్లా కమిటీ ఆధ్వర్యంలో సీపీఐ(ఎం) రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులుగా ఎన్నికైన మహమ్మద్ అబ్బాస్ను కలిసి శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రజా సమస్యల పరిష్కారం కోసం ప్రతి ఒక్కరూ నాయకులుగా కృషిచేయాలని అన్నారు. అందరూ కలిసికట్టుగా పనిచేయాలని సూచించారు.