Authorization
Wed March 19, 2025 10:14:24 pm
నవతెలంగాణ-ఘట్కేసర్
ఈ నెల 30వ తేదీన గట్టుమైసమ్మ జాతరను కోవిడ్ నిబంధనలతో జరుపనున్నట్టు ఈ ఓ భాగ్యలకిë తెలిపారు. ఈ మేరకు వారు శుక్రవారం ఒక ప్రకటన విడుదల చేశారు. మైసమ్మ గుట్టను రంగులు, విద్యుత్ దీపాలతో అలంకరించామనీ, జాతరలో సీసీ కెమెరాలు ఏర్పాటు చేస్తున్నట్టు తెలిపారు. అమ్మవారిని దర్శించుకోవాడానికి వచ్చే భక్తులు తప్పనిసరిగా భౌతిక ధూరం పాటించి, మాస్కులు ధరించాలనీ, భక్తులు గుంపులు గుంపులుగా ఉండకుండాదని తెలిపారు. కొవిడ్ నిబంధనలు పాటించకుంటే చర్యలతోపాటు జరిమాన కూడా విధిస్తామని తెలిపారు. జాతరకు వచ్చే భక్తులు తమకు సహకరించాలని కోరారు.