Authorization
Mon Jan 19, 2015 06:51 pm
అంబర్పేట డివిజన్ కార్పొరేటర్ విజరుకుమార్ గౌడ్
నవతెలంగాణ-అంబర్పేట
పటేల్నగర్లోని ప్రతి సమస్యనూ పరిష్కరిస్తామని జీహెచ్ఎంసీ స్టాండింగ్ కమిటీ సభ్యుడు, అంబర్పేట డివిజన్ కార్పొరేటర్ స్థానికు లకు హామీనిచ్చారు. పటేల్నగర్లోని సమస్యలపై ఆదివారం పటేల్నగర్ స్థాని కులు విజరు కుమార్గౌడ్ను కలిసి చర్చించారు. ఈ సందర్భంగా విజరు కుమార్గౌడ్ మాట్లాడుతూ పటేల్నగర్లోని సమస్యలను ఒక్కటొక్కటిగా పరిష్కరించేందుకు కషి చేస్తామన్నారు. ప్రతి సమస్యనూ ఎమ్మెల్యే కాలేరు వెంకటేష్ దష్టికి తీసుకువెళ్ళి పరిష్కారం కోసం నిధులు మంజూరు చేపిస్తామని పేర్కొన్నారు. అధికారులను సమన్వయపరుస్తూ పటేల్నగర్లోని రోడ్లు, డ్రయినేజీ, మంచినీటి సమస్యలను త్వరితగతిన పరిష్కరించేందుకు చర్యలు తీసుకుంటామని తెలిపారు. ఈ సమావేశంలో పటేల్నగర్వాసులు శశీధర్రావు, చంద్రమౌళి, రాజేష్, మహేందర్, వెంకటేష్, కష్ణచారి, సురేష్, పెంటంచారి, ప్రకాష్, మహ్మద్ జిలానీ, ఎల్లయ్య, టీఆర్ఎస్ నాయకులు జాకీబాబు, మహేష్ ముదిరాజ్, వేణు, సంతోష్చారి, వినరు పాల్గొన్నారు.