Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-మీర్పేట్
మీర్పేట్ కార్పొరేషన్ 27వ డివిజన్ పరిధిలోని సిర్లాహిల్స్ కాలనీ అసోసియేషన్ నూతన కమిటీని స్థానిక కార్పొరేటర్ పసునూరి భిక్షపతి, కాలనీ వ్యవస్థాపకులు సిర్ల తులసీదాసు ఆధ్వర్యంలో ఆదివారం ఎన్నుకున్నారు. అధ్యక్షులుగా రుద్ర వెంకటేష్, ప్రధాన కార్యదర్శిగా ఎర్రగడ్డ రమేష్, కోశాధికారిగా ఆర్టీసీ కుమార్, ఉపాధ్యక్షు లుగా చందు, లక్ష్మీ రాజు, అశోక్ గౌడ్, మహేందర్, ఇజ్రాయిల్, ప్రగతి, సహాయ కార్యదర్శులుగా సురేష్, మహేష్, నరేష్, పద్మశ్రీ, రాంచందర్ చారి, గౌరీ, భాగ్య రేఖలతో పాటు మరో 17మందితో కమిటీని ఎన్నుకు న్నారు. ఈ సమావేశంలో కాలనీ మాజీ అధ్యక్షులు వెంకటయ్య, జయమ్మ, మనోహర్, బుజంగం, వెంకటేష్ తదితరులు పాల్గొన్నారు.