Authorization
Fri March 21, 2025 10:10:45 pm
నవతెలంగాణ-సరూర్నగర్
కేంద్ర ప్రభుత్వం వివిధ పన్నుల ద్వారా విద్య కోసం వసూలు చేస్తున్న సెస్సుల లెక్కలను ప్రజల ముందుం చాలని తెలంగాణ ప్రజల పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు మురళీధర్ గుప్తా డిమాండ్ చేశారు. ఆదివారం విజయపురి కాలనీలోని రాష్ట్ర పార్టీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. కేంద్ర ప్రభుత్వం విద్య కోసం వసూలు చేసే సెస్సులను దుర్వినియోగం చేసిందన్నారు. ఇంతవరకు వాటిని విద్య కోసం వినియోగించలేదన్నారు. వాటన్నింటికీ లెక్కలు చెప్పాలనీ, లేదంటే విద్య, వైద్య రంగాన్ని ప్రజలందరికీ ఉచితం చేయాలనీ, కేంద్ర ప్రభుత్వం తక్షణమే దీనిపై శ్వేత పత్రం విడుదల చేయాలని డిమాండ్ చేశారు. లేనిపక్షంలో జాతీయ పార్టీలతో కలిసి కేంద్ర ప్రభుత్వంపై పోరాటం చేస్తామని హెచ్చరించారు. ఈ సమావేశంలో పార్టీ గౌరవ సలహాదారులు వైవిఎస్ శాస్త్రి, రిటైర్డ్ ఐఆరెస్ అధికారి, సెక్రెటరీ జనరల్ అయినాల కృష్ణారావు, జనరల్ సెక్రెటరీ అబ్దుల్ సత్తార్ ఖాన్, ఆర్గనైజింగ్ సెక్రెటరీ నరసయ్య, తదితరులు పాల్గొన్నారు.