Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-మల్కాజిగిరి
తిరుమల తిరుపతి దేవస్థానం స్థానిక సలహాదారు కమిటీ సభ్యులుగా తెలంగాణ నుంచి మల్కాజిగిరి సర్కిల్ గౌతంనగర్ డివిజన్ అన్నపూర్ణ సొసైటీకి చెందిన ప్రముఖ పారిశ్రామికవేత్త బీవీ రమణారెడ్డి నియమితులై నట్టు సోమవారం అన్నపూర్ణ సొసైటీ లోని ఆయన నివాసంలో ఏర్పాటు చేసిన సమావేశంలో తెలిపారు. ఈ సందర్భంగా రమణారెడ్డి మాట్లాడుతూ టీటీడీ బోర్డు చైర్మెన్ వైవీ సుబ్బారెడ్డి, టీటీడీ స్థానిక సలహాదారు కమిటీ తెలంగాణ బోర్డ్ చైర్మెన్ భాస్కర్రావు నియా మక ఉత్తర్వులు అందజేసినట్టు తెలిపారు. భక్తుల మనోభావాలకు అనుగు ణంగా సేవ చేస్తా ననీ, వైవీ సుబ్బారెడ్డి, భాస్కర్ రావుకు కృతజ్ఞతలు తెలిపారు.