Authorization
Tue March 18, 2025 02:09:48 pm
హోంమంత్రి మహమూద్ అలీ
నవతెలంగాణ-ధూల్పేట్
దళితుల అభివద్ధే ప్రభుత్వ ధ్యేయం అని హోంమంత్రి మహమూద్ అలీ అన్నారు. జియాగూడ మాజీ కార్పొరేటర్ మిత్రకష్ణ నేతత్వంలో టీఆర్ఎస్ నాయకులు ఆయన్ను కలిసి దళిత బంధు అమలుపై చివరిపత్రం ఇచ్చారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ దళితులను ధనవంతులను చేయడమే సీఎం కేసీఆర్ ప్రధాన లక్ష్యమని అన్నారు. అంతరం మాజీ కార్పొరేటర్ మిత్రకష్ణ మాట్లాడుతూ జియాగూడ డివిజన్లో పెద్ద సంఖ్యలో దళిత కుటుంబాలు ఉన్నాయని, వారికి దళిత బంధు పథకం అమలయ్యేలా చూడాలని కోరారు. దళిత కుటుంబాలు అభివద్ధి చెందేలా సీఎం కేసీఆర్ ఈ పథకాన్ని ప్రవేశపెట్టారని తెలిపారు. కార్యక్రమంలో టీఆర్ఎస్ నాయకులు నరహరి చారి, పి.బాబు, జడల మోహన్ తదితరులు పాల్గొన్నారు.