Authorization
Fri March 21, 2025 10:41:14 pm
నవతెలంగాణ-మల్కాజిగిరి
మల్కాజిగిరి డివిజన్ పరిధిలోని పవర్ బోర్స్ రిపేర్ చేయాలనీ, పెండింగ్లో ఉన్న యూజీడీ వర్క్స్ను రానున్న వేసవికాలం దృష్ట్యా వెంటనే పూర్తి చేయాలని శుక్రవారం మల్కాజిగిరి డివిజన్ కార్పొరేటర్ శ్రావణ్ వాటర్ వర్క్స్ జీఎం సునీల్ను మర్యాదపూర్వకంగా కలిసి సమస్యలను వివరించారు. వెంటనే స్పందించిన జీఎం త్వరలోనే పవర్ బోర్స్ రిపేర్, యూజీడీ వర్క్స్ పనులను పూర్తి చేస్తామని హామీనిచ్చారు. ఈ కార్యక్రమంలో బీజేపీ నాయకులు లక్ష్మణ్, మురళిగౌడ్, సునీల్ యాదవ్, తదితరులు పాల్గొన్నారు.