Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-బంజారాహిల్స్
సిటీకి చెందిన జైన్? కన్ స్ట్రక్షన్స్ మల్కాజ్గిరి సఫిల్గూడలో కాసా వాటర్సైడ్ పేరుతో గేటెడ్ కమ్యూనిటీ ప్రాజెక్టును లాంచ్ చేసింది. మొత్తం ఐదుబ్లాకుల్లో 2,3,4 బెడ్రూమ్లతో కూడిన 520 లగ్జరీ హోమ్స్ను నిర్మిస్తున్నారు. ధరలు రూ.81.5 లక్షల నుంచి రూ.1.9 కోట్ల వరకు ఉంటాయి. బేస్? ప్రైస్ చదరపు అడుగుకు రూ.ఆరు వేల నుంచి మొదలవుతుంది. ప్రాజెక్టు ఏరియా 8.49 ఎకరాలు కాగా, ఐదు ఎకరాల్లో అపార్టుమెంట్లను నిర్మించారు. డెలివరీలు వచ్చే ఏడాది డిసెంబరు నుంచి మొదలవుతాయని జైన్ కన్స్ట్రక్షన్స్ ప్రకటించింది. కంపెనీ పార్ట్నర్ సుబ్రత్ చౌదరి మీడియాతో మాట్లాడుతూ క్వాలిటీలో ఎక్కడా రాజీపడలేదని, అందుకే ఇప్పటి వరకు 300 యూనిట్లు బుక్? అయ్యాయని చెప్పారు. వినోదం కోసం గార్డెన్, స్విమ్మింగ్పూల్, క్లబ్ హౌజ్ వంటి సదుపాయాలు ఉన్నాయని చెప్పారు. గుడి, మెడిటేషన్ సెంటర్, స్పా, సెలూన్, పార్లర్, జిమ్, కాఫీ లాంజ్, ఇండోర్ గేమ్ జోన్, స్పోర్ట్స్ కోర్టులు, లైబ్రరీలను కూడా అందుబాటులోకి తెస్తామని చెప్పారు. తమ కస్టమర్లు యాక్సిస్, హెచ్డీఎఫ్సీ, కెనరా, ఐసీఐసీఐ వంటి 13 బ్యాంకుల నుంచి లోన్లు కూడా పొందవచ్చని చౌదరి వివరించారు. ఇప్పటి వరకు తాము 35 ప్రాజెక్టులను పూర్తి చేశామని, మరో నాలుగు నిర్మాణదశలో ఉన్నాయని చెప్పారు.