Authorization
Mon Jan 19, 2015 06:51 pm
ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు
నవతెలంగాణ-బాలానగర్
ప్రజల అవసరాలకు అనుగుణంగా మౌలిక సదుపాయాలు కల్పించడమే ప్రభుత్వ ధ్యేయమని కూకట్పల్లి ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు అన్నారు. శనివారం నియోజకవర్గ పరిధిలోని ఫతేనగర్ డివిజన్ పరిధిలో కార్పొరేటర్ పండాల సతీష్గౌడ్తో కలిసి పలు అభివృద్ధి పనులకు ఎమ్మెల్యే శంకుస్థాన చేశారు. సమతానగర్లోని నాలాను పరిశీలించి స్థానికులు ఇబ్బందులు లేకుండా చర్యలు తీసుకోవాలని అధికారు లకు సూచించారు. అనంతరం శోభన కాలనీ వద్ద రూ.7.5లక్షల వ్యయంతో చేపట్టే అన్నపూర్ణ క్యాంటీన్కు శంకుస్థాపన చేశారు. ఓల్డ్ ఎయిర్ పోర్టువద్ద మెస్ నిర్మాణం అండ్ ఫుట్పాత్ కోసం రూ.28లక్షలతో చేపట్టే పనులకు శంకుస్థాన చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడు తూ... కూకట్పల్లి నియోజకవర్గంలో నిత్యం అభివృద్ధి కార్యక్రమాలు జరుగుతూనే ఉన్నాయని, ప్రజలకు అసౌకర్యం కలుగకుండా మౌలిక సదుపాయాలు కల్పించ డమే ప్రభుత్వ లక్ష్యమని అన్నారు.