Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-ఓయూ
ఉస్మానియా యూనివర్సిటీలోని సరస్వతి ఆలయ అభివద్ధికి తమ వంతు సహకారంగా రూ.25,116/- (ఇరవై ఐదు వేల నూట పదహారు) లు ఆలయ తుంగతుర్తి ఎమ్మెల్యే డా.గాదరి కిశోర్ కుమార్-కమల దంపతులు అందజేశారు. ఓయూలోని సరస్వతి అమ్మ వారి ఆలయంలో తన కుమారుడికి అక్షరాభ్యాసం చేయించిన తుంగతుర్తి ఎమ్మెల్యే డా.గాదరి కిశోర్ కుమార్ కుటుంబ సభ్యులు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే డా.గాదరి కిశోర్ కుమార్ తను చదువుకున్న ఉస్మానియా యూనివ ర్సిటీలోని సరస్వతి అమ్మవారి ఆలయంలో తన చిన్న కుమారుడు గాదరి నిమిత్కు అక్షరాభ్యాసం చేయించారు. వారికి ఆలయ అర్చకులు ప్రత్యేక పూజలు నిర్వహించి, తీర్ధప్రసాదాలను అందించి కుటుంబ సభ్యులను ఆశీర్వదించారు. తదనంతరం సరస్వతి ఆలయ అభివద్ధికి ఎమ్మెల్యే డా.గాదరి కిశోర్ కుమార్-కమల తమ వంతు సహకారంగా రూ.25,116/- (ఇరవై ఐదు వేల నూట పదహారు) రూపాయలు ఆలయ సిబ్బందికి అందజేశారు. ఈ కార్యక్రమంలో టీఆర్ఎస్వి రాష్ట్ర నాయకులు వల్లమల్ల కష్ణ, రాష్ట్ర ప్రధాన కార్యదర్శి పడాల సతీష్, రాష్ట్ర ఉపాధ్యక్షులు జంగం అవినాష్, కిరణ్గౌడ్, నాయకులు జిల్లా శంకర్, కంచి రాజేష్, శోభన్ బాబు, మేకల రవి, కిషోర్, జానీ, విద్యార్థి నాయకులు పాల్గొన్నారు.