Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-మేడ్చల్ కలెక్టరేట్
కీసర మండలం పోలీస్ స్టేషన్ పరిధిలో మత్తు పదార్థాలకు యువత బానిస కావొద్దని కీసర సీఐ రఘువీర్ రెడ్డి పేర్కొన్నారు. ఆదివారం రాంపల్లి దాయర గ్రామ పంచాయతీ పరిధిలోని జెఎన్ఎన్యూఆర్ఎం కాలనీలో సర్పంచ్ గరుగుల అండాలు మల్లేష్ ఆధ్వర్యంలో డ్రగ్స్ పై అవగాహన కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా సీఐ రఘువీర్ రెడ్డి మాట్లాడుతూ గంజాయి, డ్రగ్స్ మత్తులో యువత పక్కదారిన పడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. నిషేధిత మత్తు పదార్థాలకు ప్రజలు దూరంగా ఉండాలని అన్నారు. మాదక ద్రవ్యాల మత్తులో జీవితాల్ని పాడు చేసుకోవద్దని,మత్తులో నేరాలు చేసి సమాజంలో నేరస్తులుగా మారవద్దని, డ్రగ్స్ వాడిన, చట్ట ప్రకారం కఠిన చర్యలు తీసుకుంటామరన్నారు. కొకైన్,హెరాయిన్, గంజాయి,నాటు సారా, లాంటి మత్తు పదార్థాలు వాడటంతో మనిషి మెదడుపై మత్తు ప్రభావంతో ఆలోచన శక్తి తగ్గి యువత నేరాల బాటనా పడుతున్నారని. దీనికి కుటుంబ పరంగా తల్లి తండ్రులు కూడా పిల్లల పట్ల ఎప్పటి కప్పుడు దష్టి సారించాలని వారి భవిషత్,సమాజ శ్రేయస్సు కొరకు తల్లి తండ్రుల బాధ్యత విస్మరించొద్దని కోరారు. ఎవరైనా గుర్తు తెలియని బయటి వ్యక్తులు వచ్చి గంజాయి, మాదక ద్రవ్యాలను అమ్మిన, కొన్నా చట్టరీత్యా బాధ్యులు అవుతారని, అలాంటివారు ఎవరైనా గ్రామస్థుల దష్టిలో పడితే కీసర పోలీస్ స్టేషన్లో గాని, గ్రామపంచాయతీలో గాని ఫిర్యాదు చేయవలసిందిగా తెలిపారు. డ్రగ్స్ రహిత గ్రామాలుగా తీర్చిదిద్దే బాధ్యత ప్రతి ఒక్కరిపై ఉందని గ్రామ ప్రజలచేత ప్రతిజ్ఞ చేయించారు. కార్యక్రమంలో సెక్టార్ సబ్ ఇన్స్పెక్టర్ రమేష్, ఎస్సైలు రాజు, జగన్ రెడ్డి, శోభన్ బాబు, నర్సింగ్ రావ్, ఎంపీటీసీ కిరణ్ జ్యోతి ప్రవీణ్ కుమార్, ఉప సర్పంచ్ గాదె రాము, వార్డ్ సభ్యులు, నాయకులు గరుగుల మల్లేష్ ,కాలనీ వాసులు పాల్గొన్నారు.