Authorization
Tue March 18, 2025 10:18:55 pm
నవతెలంగాణ-జగద్గిరిగుట్ట
సంక్షేమ సంఘం సభ్యులు ఐక్యతతో కాలనీల అభివృద్ధి మరింత సాధ్యమవుతుందని కుత్బుల్లాపూర్ ఎమ్మెల్యే కేపీ వివేకానంద్ అన్నారు. గాజులరామారం డివిజన్ పరిధిలొని మిథిలానగర్ సంక్షేమ సంఘం సభ్యులు నూతనంగా ఎన్నికైన సందర్భంగా ఆదివారం ఎమ్మెల్యేను ఆయన నివాసంలో మర్యాద పూర్వకంగా కలిసి సన్మానించారు. అనంతరం ఎమ్మెల్యే మాట్లాడుతూ కాలనీలోని సమస్యలను తన దృష్టికి తీసుకువస్తే పరిష్కరించేలా చర్యలు తీసుకుంటానన్నారు. కార్యక్రమంలో చైర్మెన్ బీఆర్ ఠాగూర్, అధ్యక్షులు సురేష్ మడ్డు, వైస్ చైర్మెన్ చౌదరి, ప్రధాన కార్యదర్శి చంగల్ రాయుడు, ఉపాధ్యక్షులు ధనుంజరురెడ్డి, విజరుకుమార్, కోశాధికారి శివకుమార్ తదితరులు పాల్గొన్నారు.