Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-బంజారాహిల్స్
మధుమేహ రోగులు కిడ్నీల విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలని, ముఖ్యంగా విరేచనాలు, వాంతులు అవుతుంటే అప్రమత్తం కావాలని మల్టీ స్పెషాలిటీ హెల్త్ కేర్ ప్రొవైడర్ సెంచురీ ఆస్పత్రుల వైద్యులు సూచించారు. ఒంట్లో క్రియాటినిన్ లెవెల్స్ ఎప్పుడూ సరిచూసుకుంటూ ఉండాలని అన్నారు. పేగుల ఇన్ఫెక్షన్లు కూడా ఈ లక్షణాలతో పాటు ఉంటే, మధుమేహ రోగుల్లో చాలా ప్రమాదకరంగా మారే అవకాశం ఉందన్నారు. పటాన్చెరువు ప్రాంతంలో ఉండే 68 ఏండ్ల వద్ధురాలు(మనోరమ) జనవరి 27న రెండు రోజుల్నుంచి విరేచనాలు, వాంతులతో బాధపడుతుండటంతో ఆమెను సెంచురీ ఆస్పత్రికి తరలించారు. ఆమెకు గత కొన్నేళ్లుగా మధుమేహం, అధిక రక్తపోటు ఉన్నాయి. మూత్రపిండాల ఇబ్బందులు గానీ, హద్రోగ సమస్యలు కానీ లేనప్పటికీ, సీరం క్రియాటినిన్ లెవెల్స్ 6.8 ఎంజీ పర్ డెసీలీటర్కి ఆకస్మికంగా పెరిగింది. ఇది సాధారణంగా 1 ఎంజీ పర్ డెసీలీటర్ కానీ అంతకంటే తక్కువగానీ ఉండాలి. ఈ సమస్య గురించి, చికిత్స గురించి సెంచురీ కన్సల్టెంట్ నెఫ్రాలజిస్ట్ వైద్య నిపుణులు డా. అరుణ్ కుమార్, ఇంటర్నల్ మెడిసిన్ కన్సల్టెంట్స్ డా. శ్రద్ధా సంఘాని, డా.పర్వీన్ సుల్తానా మాట్లాడుతూ 'సీరం క్రియాటినిన్ లెవెల్స్ పెరగడంతో పాటుగా, రోగి మూత్రం కూడా చాలా తక్కువగా ఉండడం గమనించాం. రక్తంలో యాసిడోసిస్(యాసిడ్ లెవెల్ పెరగడం) కూడా ఉంది. రోగి కుటుంబ సభ్యులతో మాట్లాడాక, హీమోడయాలసిస్ మొదలుపెట్టాం. ప్రాణాపాయం నుంచి తప్పించడానికి కొన్ని రోజుల పాటు ఫ్లూయిడ్ మేనేజ్మెంట్, సరైన మోతాదులో యాంటీబయోటిక్స్, ఎలెక్ట్రోలైట్ ఇబ్బందులు సరిచేయడం, రీనల్ రీప్లేస్మెంట్ థెరపీ చేశాం' అని తెలిపారు. నాలుగు రోజులపాటు వైద్యం అందించాక రోగి పరిస్థితి మెరుగుపడిందనీ క్రియాటిని లెవెల్స్ కూడా 1 ఎంజీ పర్ డెసీలీటర్కి వచ్చాయనీ ఇప్పుడు రోగి పూర్తిగా కోలుకున్నారరు. వారం పాటు ఆస్పత్రిలో ఉన్న తర్వాత, డిశ్చార్జ్ చేస్తామని చెప్పారు.