Authorization
Fri March 21, 2025 10:02:01 am
నవతెలంగాణ-జగద్గిరిగుట్ట
డివిజన్ పరిధిలోని సమస్యలను పరిష్కరించాలని జగద్గిరిగుట్ట డివిజన్ కార్పొరేటర్ కొలుకుల జగన్ అన్నారు. సోమవారం డివిజన్ పరిధిలోని సమస్యలపై ఆయన ఎలక్ట్రికల్ ఏఈ ప్రదీప్, మున్సిపల్ ఏఈ సతీష్లతో కలిసి సమావేశం నిర్వహించి సమస్యలపై చర్చించారు. కార్యక్రమంలో సీనియర్ లైన్ ఇన్స్పెక్టర్ వేణుగోపాల్, లైన్ ఇన్స్పెక్టర్ శివశంకర్, డివిజన్ అధ్యక్షులు రుద్ర అశోక్, యువజన నాయకులు కోలుకుల జైహింద్, నాయకులు పాపయ్యగౌడ్, విఠల్, బొగ్గుల సురేష్, వెంకటేశ్వరరావు, హనుమంతు, నాగరాజు, లక్ష్మణ్, రాము, ధర్మరాజు, తమ్మయ్య, శ్రీనివాస్, విగేష్ తదితరులు పాల్గొన్నారు.