Authorization
Mon Jan 19, 2015 06:51 pm
సీపీఐ(ఎం) ఆధ్వర్యంలో కార్పొరేటర్కు వినతి
నవతెలంగాణ-బాలానగర్
కూకట్ పల్లి నియోజకవర్గం బాలానగర్ డివిజన్ పరిధిలో రాజుకాలని ప్రధాన రహదారిలో స్పీడ్ బ్రేకర్స్ ఏర్పాటు చేయాలని సోమవారం సీపీఐ(ఎం) బాలానగర్ మండల కమిటి ఆధ్వర్యంలో సోమవారం స్థానిక డివిజన్ కార్పొరేటర్ ఆవుల రవీందర్ రెడ్డికి వినతి పత్రం అందజేశారు. ఈ సందర్భంగా పార్టీ మండల కార్యదర్శి ఐలాపురం రాజశేఖర్ మాట్లాడుతూ రాజు కాలనీ ప్రధాన రహదారిపై యువకులు వేగంతో వాహనాలు నడపడం ద్వారా చాలా మంది చిన్న పిల్లలు, వద్ధులు తరుచూ ప్రమాదాలకు గురవుతున్నారని, వాహనదారుల వేగాన్ని నియంత్రించి ఉంచేందుకు స్పీడ్ బ్రేకర్లు ఏర్పాచేయాలని స్థానికుల నుంచి సంతకాల సేకరణ చేపట్టినట్లు వినతిపత్రంలో పేర్నొన్నారు. అందుకు కార్పొరేటర్ రవీందర్ రెడ్డి సానుకూలంగా స్పందిస్తూ త్వరలో సమస్యకు పరిష్కార మార్గం చూపుతామని, డివిజన్ లో ఎటువంటి సమస్యలు నెలకొన్నా వెంటనే తన దష్టికి తీసుకు వస్తే ఎమ్మెల్యే మాధవరం కష్ణారావు సహకారంతో సమస్యలను పరిష్కరించేందుకు త్వరితగతిన కషి చేస్తామని తెలిపారు. కార్యక్రమంలో సీపీఐ(ఎం) మండల నాయకులు శంకర్, సుగుణ పాల్గొన్నారు.