Authorization
Mon Jan 19, 2015 06:51 pm
హైదర్నగర్ కార్పొరేటర్
నార్నే శ్రీనివాస్రావు
నవతెలంగాణ-కేపీహెచ్బీ
తాగునీరు వృథా చేసే వారిపై చర్యలు తీసుకోవాలని హైదర్నగర్ డివిజన్ కార్పొరేటర్ నార్నే శ్రీనివాస్రావు అన్నారు. డివిజన్ పరిధిలోని శ్రీరామ్నగర్ కాలనీ, కృష్ణవేణి నగర్ కాలనీ, సాయి ప్రశాంత్నగర్ ఫేజ్ 1, 2 కాలనీలలోని పలు సమస్యలపై, చేపట్టాల్సిన పలు అభివృద్ధి పనులపై సోమవారం ఇంజినీరింగ్, జలమండలి, ఎలక్ట్రికల్ విభాగం అధికారులతో కలిసి పాదయాత్ర నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ హైదర్నగర్ డివిజన్ను అన్ని రంగాలలో అభివృద్ధి చేసి ఆదర్శవంతంగా తీర్చిదిద్దుతామన్నారు. కార్యక్రమంలో జలమండలి మేనేజర్ ప్రశాంతి, లైన్మెన్ రాజు, జీహెచ్ఎంసీ వర్క్ ఇన్స్పెక్టర్ మహదేవ్, ఎలక్ట్రిషీయన్ నరేష్, కాలనీవాసులు రాజు సాగర్, గోపి, చెన్నయ్య, గోవింద్, శ్రీనుసాగర్, సన్నీ, మనోహర్, నాని, గాలయ్య, బాలకృష్ణ, రాజు, లక్ష్మీ, రేణుక, యేలేంద్ర తదితరులు పాల్గొన్నారు.